15 April, 2026 | 4:48 AM

వృత్తి నిబద్ధతతో పనిచేయాలి

03-01-2026 06:20 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): వృత్తి నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు గుర్తింపు తెచ్చే విధంగా పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్పీసీ లుగా విధులు నిర్వహిస్తూ, ఇటీవల హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన అధికారులు మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ జిల్లాకు కేటాయించబడిన అధికారులు: టి. సురేంద్ర బాబు, ఎ. నరేందర్, ఎం.జియ్యుద్దీన్, ఎం. విద్యాసాగర్ రెడ్డి, టి. దామోదర్, ఎం. ఇంకేశఫ్ అలీ ఉన్నారు.