15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మీ కుటుంబమే నన్ను ఓడించింది..

17-12-2025 01:09 AM
  1. బాలింతపై ఓడిన వార్డ్ సభ్యురాలి దాడి
  2. కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో ఘటన

శంకరపట్నం, డిసెంబరు 16 (విజయక్రాంతి): తనకు ఓటేయకుండా, ఓటమికి కారణమయ్యారంటూ ఓడిన వార్డు సభ్యురాలు తన పక్కింటి కుటుంబ సభ్యులపై దాడికి దిగిన ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలం గూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మొలంగూర్ గ్రామంలో ఎనిమిదవ వార్డు సభ్యు రాలిగా పోటీ చేసిన కమురున్నీస ఓడిపోయింది.

తన పక్కింటి వారైనా రేషన్ డీలర్ దాసరి పద్మ, ఆమె కుమార్తె ప్రియాంక ఓట్లు వేయనందునే ఓడిపోయానని భావించిన కమురున్నీస వారిపై మంగళవారం దాడికి దిగింది. ప్రియాంక బాలింత అని చూడకుండా దాడికి పాల్పడింది. బాధితులను 108 అంబులెన్సులో హుజురాబాద్ ఏరి యా ఆసుపత్రికి తరలించారు.