30-05-2025 01:45:34 AM
చలోక్తులు.. పొగడ్తలతో కొనసాగిన సమీక్షా సమావేశం
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యేలు
కరీంనగర్, మే 29 (విజయ క్రాంతి): మీ ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొ న్నం ప్రభాకర్లు రాష్ట్రాన్ని శాషిస్తున్నారం టూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మం త్రి, రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శా ఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ ధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల ప్రసంగానికి ముందు ఆయన చలోక్తుల మధ్య ఈ మాట మాట్లాడారు.
శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు పార్టీకి చేసిన సేవలు, వారితో ఉన్న పరిచయం, అనుభవాలను గుర్తుచేస్తూ సీ ఎం రేవంత్ రెడ్డి కూడా అంతా అయ్యవారే(శ్రీధర్ బాబు) నడిపిస్తున్నారని అన్నారని తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై ఆ యన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. గత ప్రభు త్వం ప్రాజెక్టుల నిర్మాణంలో చేసిన అక్రమాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించా రు.
మంత్రులు మాట్లాడే ముందు ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కలికో ట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేయాలని, దీనికి ప్రభుత్వం 320 కోట్లు మంజూరు చే సిందని, భూసేకరణ నిధులు వస్తే కుడి, ఎడ మ కాలువ నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరద కాలువపై క్రాస్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని, కాళేశ్వరం ప్యాకేజీ-9 పనులు పూర్తి చేయాలని, తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన వేములవాడ అభివృద్ధి శృంగేరి పీఠాధిపతి సూచనతో ఆగమశాస్త్ర ప్రకారం చేస్తామన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పడావుగా ఉన్న సిం గరేణి భూములను ఇందిరమ్మ లబ్దిదారులకు అందించేవిధంగా చూడాలన్నారు. రాళ్లవాగు ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపును పూర్తి చేయాలని కోరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లో మన ప్రభుత్వం ఎలాంటి కటింగ్ లేకుం డా రైతులకు న్యాయం చేసిందని వివరించారు.
383, 386, 389, 399 కాలువలకు నీటి ఇబ్బంది పోవాలంటే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం జరగాలన్నారు. జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో కాలువలు, షెటర్ మరమ్మత్తులు పూర్తి చేయాలని అన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, అటవీ భూముల సమస్యను. పరిష్కరించాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, భూ సేకరణ కోసం 23 కోట్లు, ప్రాజె క్టు పూర్తి కావడానికి మరో 20 కోట్లు విడుదల చేయాలని కోరారు.
కొండగట్టు ఎత్తిపో తల పథకం పూర్తి చేసేందుకు మరో 22 కోట్లు విడుదల చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడు తూ ఇందిరమ్మ ఇళ్లలో కరీంనగర్ జిల్లా ప్ర స్తుతం 8వ స్థానంలో ఉందని, కరీంనగర్ నియోజకవర్గానికి సం బంధించి ఇందిరమ్మ కమిటీలు వేయకపోవడం వల్ల ఇక్కడ పంపి ణీ పూర్తి కాలేద న్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లే శం, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొముర య్య, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, పెద్దపల్లి అడనపు కలెక్టర్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.