25-06-2025 02:02:15 PM
కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చింతిరాల అరుణ్ రాజ్
భద్రాచలం,(విజయక్రాంతి): రైతు భరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసిన సందర్భంలో భద్రాచలం నియోజకవర్గం రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ... మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చింతిరాల అరుణ్ రాజ్ మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యమని మరోసారి ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. రైతు భరోసా ద్వారా అందుతున్న నిధులను రైతులు తమ పంటల పెట్టుబడుల కోసం వినియోగించుకొని, మంచి పంటలు పండించుకోవాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తూనప్పటికీ, ఇవన్నీ కనిపించక, విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు మా ప్రభుత్వ రైతు సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి, దురుద్దేశంతో చేసే విమర్శలను మానుకొని, రైతులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకు రావాలని హితవు పలికారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఇచ్చిన మాట ప్రకారం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చింతిరాల అరుణ్ రాజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.