calender_icon.png 25 June, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమనాయకుడిగా కేసీఆర్‌ను అభిమానిస్తా

25-06-2025 01:39:57 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలల్లో చేసిందని టీపీసీసీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ  మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ... అభూతకల్పనలతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన అద్భుతంగా జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు అని మహేష్ కుమార్ కోరారు. కాంగ్రెస్ హయంలో జరిగిన సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగదని వ్యాఖ్యానించారు. 

 గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాత్రమే పథకాలు, హామీలు ఇచ్చి.. ఎన్నికలయ్యాక ఎగ్గొట్టేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం దళితబంధు అన్నారు. ఉద్యమనాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను అభిమానిస్తా, కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. రాష్ట్ర అవసరాలను, హక్కులను గత ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి-బనకచర్లపై లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షలు మహేష్ కుమార్ వివరించారు.