calender_icon.png 26 June, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత యాంటీడ్రగ్స్ సోల్జర్స్‌గా పనిచేయాలి

26-06-2025 12:15:47 AM

నారాయణపేట. జూన్ 25 (విజయక్రాంతి):నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా పనిచేయాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ముఖ్యంగా యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవా రం డీ డబ్ల్యు ఓ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో కలెక్టరేట్, పోలీస్, ప్రెస్, డీ.డబ్ల్యు.ఓ మొత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి.

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యా చ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీ, అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు సూచించారు. అనంతరం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా కలెక్టరేట్ పోలీస్ టీం ల మధ్య ప్రారంభ మ్యాచ్ ను ఎస్పీ, అదనపు కలెక్టర్ టాస్ వేసి ప్రారంభింపజేశారు. మొదట బ్యాటింగ్ చేసిన పో లీసు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 91 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

92 పరుగుల లక్ష్యంతో బలిలోకి దిగిన కలెక్టరేట్ జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత ప్రెస్, డీ.డబ్ల్యు.ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్ టీమ్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఏకంగా 148 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించగా, డీ.డబ్ల్యు.ఓ జట్టు కేవలం 76 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. చివరగా మొదటి మ్యాచ్ లో గెలిచిన పోలీస్ జట్టు, రెండో మ్యాచ్ లో గెలిచిన ప్రెస్ జట్టు తుది పోరులో తలపడ్డాయి.

మొదట బ్యాటింగ్ చేసిన ప్రెస్ జట్టు పది ఓవర్లలో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పోలీస్ జట్టు ముందు ఉంచింది. అయితే పోలీస్ జట్టు 5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. గెలుపొందిన విన్నర్, రన్నర్ జట్లకు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్, డిపిఆర్‌ఓ ఎం.ఏ. రషీద్ కప్ లను అందజేసి ఇరు జట్లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి నల్లపు లింగయ్య, ఆర్‌ఐ నరసింహ, డి వై ఎస్ ఓ వెంకటేష్, స్థానిక ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, కలెక్టరేట్, పోలీ సు, డిడబ్ల్యుఓ, మీడియా మిత్రులు, వ్యాయామ ఉపా ధ్యాయులుపాల్గొన్నారు.