2 July, 2026 | 2:17 PM

Breaking News

తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •   మటన్‌లో గోమాంసం.. ఇద్దరు అరెస్ట్   •  

Districts - Bhadradri Kothagude

article_12407437.webp
సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026

కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో బుధవారం జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర్య సమరయోధులు అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (డాక్టర్ బి.సి. రాయ్) జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991 నుండి ప్రతి ఏడాది జులై1వ తేదీ ని మన దేశం లో డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నామని,

01-07-2026

article_42785557.webp
సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేసి, JBCCI–12వ వేతన ఒప్పంద చర్చలను వెంటనే ప్రారంభించాలని జిఎం (వెల్ఫేర్) కు మెమొరండం సమర్పించిన జాతీయ సంఘాల నాయకులు ఐఎన్టియుసి జాతీయ నాయకులు డా. శ్రీ సంజీవరెడ్డి నాయకత్వంలో సెక్రటరీ జనరల్ డా. శ్రీ బి.జనక్ ప్రసాద్ ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, ఓపెన్ కాస్ట్, మరియు డిపార్ట్మెంట్స్ లలోని నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు, ప్రధాన కార్యాలయం ముందు భారీ ఎత్తున జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

01-07-2026

article_30214661.webp
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని గిరిప్రసాద్ నగర్, జయశంకర్ కాలనీలలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆశిష్ జకోటియా ఆధ్వర్యంలో, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరం అనంతరం గ్రామ ప్రజలకు నిస్వార్థంగా ఉచిత వైద్య సేవలు అందించినందుకు గుర్తింపుగా, జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లోతువాగు సర్పంచ్ ఈసం కళ్యాణి ఆధ్వర్యంలో డాక్టర్ ఆశిష్ జకోటియాను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

01-07-2026

article_12044999.webp
జీఓ నంబర్ 12ను వెంటనే రద్దు చేయాలి

భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం తాపీ కార్మికుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ స్వప్నకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పిట్టల అర్జున్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఫలాలు కార్మికులకు అందనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 12 తీసుకువచ్చి భవనిర్మాణ కార్మికులకు చెందవలసిన కోట్ల రూపాయల నిధులను ఒక బ్రోకర్ సంస్థకు కట్టబెట్టడం దుర్మార్గమని అన్నారు.

01-07-2026