05-08-2025 12:11:23 AM
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
ములుగు, ఆగస్టు4 (విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివా కర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమా నికి 65దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 20, గృహ నిర్మాణ శాఖకు 15, ఉపాధి కల్పనకు 07పెన్షన్ 09, ఇతర శాఖలకు సంబంధించినవి 14 ఫిర్యాదులు అం దాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరు పుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు లపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.