calender_icon.png 19 June, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగజీవన్ రామ్

05-04-2025 04:54:04 PM

భద్రాచలం,(విజయక్రాంతి): దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆలు పెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. శనివారం  ఐటిడిఏ సమావేశం మందిరంలో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటిడిఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ 05 ఏప్రిల్ 1908 వ సంవత్సరంలో బీహార్ లోని వెనుకబడిన కులంలో పేద కుటుంబంలో జన్మించారు.

పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, బీహార్ లోని వెనుకబడిన కులంలో పుట్టిన బాపూజీగా ఆయన ప్రసిద్ధి చెందారు. భారత పార్లమెంట్లో40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమై ఆల్ ఇండియా డిప్రెషన్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించరు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత గ్రామీణ, కార్మిక ఉద్యమాన్ని నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి వారిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అటువంటి మహనీయుని మననం చేసుకొని మనమందరం మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు.