05-04-2025 04:51:35 PM
పట్టించుకోని అధికారులు...
కృష్ణ: విద్యుత్ ఆదా చేయాలని పదేపదే చెప్తున్న మీటర్లు బిగించిన వీధి దీపాలు ఆపే నాధులే లేక పట్టపగలు మిట్ట మధ్యాహ్నం సైతం వీధి దీపాలు మండలంలోని గుడెబల్లూర్ ముడుమాల, మురహరి దొడ్డి తదితర గ్రామాల్లో నిరంతరంగా వెలుగుతున్నాయి. గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వీధి దీపాలు వెలుగుతున్నాయని అధికారుల నిర్లక్ష్యం వలన విద్యుత్ వృధా ఖర్చు అవుతుందని వృధా అవుతున్న విద్యుత్ ఖర్చును ప్రజలపై వేసి వసూలు చేస్తారేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.