calender_icon.png 3 February, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.90 లక్షల ఎల్‌ఓసీ అందజేత

03-02-2026 02:14:57 AM

జనగామ, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి):జనగామ మండలం శామీర్ పేట గ్రామానికి  చెందిన గుజ్జుల వెంకటేశ్వర్లుకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా, ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుక రాగా వెంటనే స్పందించి. మంత్రి పొన్నం ప్రభాకర్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందించి. ఎల్వోసి, సి ఎం ఆర్‌ఎఫ్ ద్వారా 1,90,000 మంజూరు చేయించారు.

ఇట్టి మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఎల్ వో సి మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి మరియు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గానిపాక వనిత మహేందర్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ రాజు, కడవాంచి రాజు, కమలాకర్ రాజేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.