16 March, 2026 | 3:02 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

03-01-2026 08:07 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే  చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి విద్యా బోధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన మహిళా ఉపాధ్యాయినులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా  శాలువాలతో సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సేవలను గుర్తు చేసుకున్నారు.