12 March, 2026 | 9:32 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

గ్రామ సింహాల పట్టివేత

05-01-2026 05:52 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ సింహాలను పట్టి వేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష _లోకేష్ గౌడు తెలిపారు. సోమవారం ఆయన గ్రామంలో ఉన్న వీధి కుక్కల బెడద నుండి కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడి నుండి తరలించడానికి హైదరాబాదు నుంచి వచ్చిన ప్రత్యేక వారి చేత వ్యాన్లలో తరలించారు. గ్రామంలో ప్రయాణికుల, గొర్రెలను మేకలను కోళ్లను ఈ వీధి కుక్కలు ఇబ్బందులు కలుగజేస్తున్నందువల్ల ప్రజల ఫిర్యాదు మేరకు చేసిన వీధి కుక్కల తరలింపు కార్యక్రమానికి సర్పంచును గ్రామస్తులు కొనియాడారు. జనావాసాల రహిత ప్రాంతాలకు ఈ గ్రామ సింహాలను తరలిస్తున్నట్లు సర్పంచి తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి యూసఫ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.