మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
సంగారెడ్డి, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి) : తెలంగాణ కాంగ్రెస్లో రాహుల్గాంధీ కాంగ్రెస్, సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలు రెండు ఉన్నాయని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈదు మిలాప్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపి బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తుందన్నా రు. సీఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా పని చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వాదించాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మాణిక్రావు, జహీరాబాద్ బీఆర్ ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త దేవిప్రసాద్రావు, బీఆర్ఎస్ నాయకులు నరోత్తం, జైపాల్రెడ్డి, మాణిక్యం పాల్గొన్నారు.