రేపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు

24-04-2024 01:57:39 AM

n ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో సమయం పొడిగింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మైట్రో రైలు అధికారులు మెట్రో రైళ్ల సమయాన్ని అర్ధరాత్రి ఒంటిగంట వరకు పొడిగించినట్లు మంగళవారం ప్రకటించారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. 

ప్రత్యేకంగా 60 బస్సులు.. 

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కంటోన్మెంట్, ఇబ్రహీంపట్నం, ముషీరాబాద్ డిపో మేనేజర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సమాచారం కోసం కంటోన్మెంట్  99592 26143, ఇబ్రహీంపట్నం 99592 26141, ముషీరాబాద్  99592 26418 లో సంప్రదించవచ్చని తెలిపారు.