దంచికొట్టిన ఎండ

24-04-2024 02:07:40 AM

l నేడు, రేపు పలుజిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాష్ట్రవాప్తంగా మంగళ వారం ఎండ దంచికొట్టింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45 డిగ్రీలు, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్, కరీంనగర్‌లో 43, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డిలో 42, వరంగల్‌లో 41, ఆదిలా బాద్‌లో 40 డిగ్రీలు నమోదైంది. దీంతో మధ్యాహ్నం పట్టణాలు, గ్రా మాల్లోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కారణంగా బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.