నాయికాన్వేషణ..?

26-04-2024 02:37:44 AM

కొత్త సినిమా మొదలవుతుందంటే హీరో, దర్శకుల తర్వాత హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్నది ఆసక్తిగొలిపే విషయం. అందునా అగ్ర హీరోల చిత్రాలంటే అది మరింత చర్చకు దారి తీస్తుంది.  పాత్రకు సరిపడేలా ఉంటూనే హీరో గ్రేస్‌కు డాన్స్ మూమెంట్స్‌కు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అందుకే అటువంటి నాయికా పాత్రలకు ఎప్పటికప్పుడు అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఆ కోవలో ప్రస్తుతం నాయికాన్వేషణ జరుగుతున్న చిత్రాల  వివరాల్లోకి  వెళితే..

వీరితో పాటు ప్రభాస్  సందీప్ రెడ్డి వంగా, మహేశ్  రాజమౌళి చిత్రాల్లోనూ హీరోయిన్ ఎవరన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు  నాగచైతన్య కలయికలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్రలో మెరవనున్నారు. ఇదే 

నిజమైతే కొంతకాలంగా తెలుగు తెరపై కనపడని పూజ ఈ చిత్రం ద్వారా మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కెరీర్ తొలి నాళ్ళలో ‘ఒక లైలా కోసం’ చిత్రానికై పూజ తొలిసారి నాగ చైతన్యతో తెరపంచుకున్న సంగతి తెలిసిందే. అగ్రనటుడు వెంకటేశ్ గురించి చెప్పుకుంటే.. సైంధవ్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల తర్వాత వీరివురి కలయికలో రానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన నాయిక ఎవరన్న విషయంపై చిత్రబృందం కసరత్తు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి దాదాపు ఖరారు అని వినిపిస్తున్నా, మరో నాయికకు సైతం ఈ చిత్రంలో చోటుందట. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. క్రైమ్ ఎంటర్టునర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి బీమ్స్ సిసిరొలియో స్వరకర్త. 

అల్లు అర్జున్  అట్లీ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రాబోతుంది. పుష్ప చిత్రం ద్వారా అల్లు అర్జున్, జవాన్ ద్వారా అట్లీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో తలమునకలై ఉన్నారు. కాగా ఈ సినిమా కోసం సమంత హీరోయిన్‌గా మరియు త్రిష మరో ముఖ్యపాత్రలో నటించేందుకు వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ‘ఖుషి’ చిత్రం తర్వాత సమంత ఇప్పటివరకు మరో సినిమా ఒప్పుకున్నది లేదు. అయితే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన సమంతను ఈ అవకాశం వరిస్తుందనుకున్నా, అటు త్రిష పేరు కూడా కోలీవుడ్ గట్టిగానే వినిపిస్తోంది. వీటితో పాటు త్రివిక్రమ్ సహా పలువరు దర్శకులతో బన్నీ చేయబోయే సినిమాల్లోనూ కథానాయికలెవరన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. 

ఈ ఏడు గేమ్ చేంజర్ గా తెరమీదికి రానున్న రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకై జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే బుచ్చిబాబుతో ఆర్‌సి 16ను పట్టాలెక్కించనున్న చరణ్, రంగస్థలం తర్వాత సుకుమార్‌తో మరో చిత్రం చేయనున్నారు. బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్న సినిమాలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌తో జతకట్టిన చరణ్, సుకుమార్ చిత్రంలో ఎవరితో ఆడిపాడనున్నారనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. గేమ్ చేంజర్ విడుదలై, ఆర్‌సి 16 పూర్తయితే కానీ ఈ ప్రశ్నకు బదులు దొరకడం కష్టం.