రెజ్లింగ్ సమాఖ్యకు హెచ్చరిక

27-04-2024 12:44:30 AM

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)ను నడిపించేందుకు అడ్‌హక్ కమిటీని తీసుకొస్తే ఊరుకునేది లేదని వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరికలు జారీ చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే రానున్న ఒలింపిక్స్‌లో భార త రెజ్లర్లు పాల్గొనే అవకాశం కోల్పోతారని స్పష్టం చేసింది. ఇటీవలే ఢిల్లీ హై కోర్టు  అడహక్ కమిటీని రద్దు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియే షన్ (ఐవోఏ)ను కోరిన సంగతి తెలిసిందే. ఈలోగానే వరల్డ్  రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ స్పందించడం గమనార్హం.