17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా?

11-05-2025 01:11 AM

-ఎమ్మెల్యే వివేకానంద

హైదరాబాద్, మే 10 (విజయక్రాం తి): యుద్ధ వాతావరణ సమయంలో అందాల పోటీలు అవసరామా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రశ్నించారు. అందాల పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో జరగాలని, ఇప్పుడు హైదరా బాద్‌లో నిర్వహిస్తున్న అందాల పోటీ లు దేశంలో యుద్ధ వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలు భయాందోళనతో ఉన్న ఈ సమయంలో జరుగుతున్న అందాల పోటీలను తక్షణమే ఆపాలని డిమాం డ్ చేశారు. శనివారం హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు యుద్ధభయంతో నిత్యా వసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

అభినవ నీరోలా సీఎం వ్యవహారిస్తున్నారని, మన విద్యార్థులు పంజాబ్, శ్రీనగర్ నంచి స్వస్థలాలకు రావలనుకుంటున్నారని, వారి గురించి ఆలో చిం చారా? అని ప్రశ్నించారు. సీఎం ఆలోచనా విధానం మారాలని హితవుప లికారు. యుద్ధంలో అమరుడైన జవా న్ మురళీ నాయక్‌కు తమ పార్టీ నివా ళి అర్పిస్తోందని చెప్పారు. సమావేశంలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.