calender_icon.png 23 June, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహం పేరిట నీచపు ఆట

23-06-2025 12:49:12 AM

  1. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

కేసులో 8 మంది అరెస్ట్

నిందితుల్లో ఇద్దరు బాలురు

ఆదిలాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): స్నేహం పేరిట ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించారు. స్నేహాన్ని అడ్డుపెట్టుకొని తనతో పాటు తన స్నేహితులతో కలిసి బాలికను మా నసికంగా కృంగదీసిన అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గుడిహత్నూర్ మండలం లో ఓ మైనర్ బాలికతో చిన్ననాటి నుంచి స్నేహం పేరుతో దగ్గరైన ఓ బాలురు బాలికతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసేవాడు. బాలికతో చేసిన చాటింగ్ ఆమె తల్లిదండ్రులకు, ఇతరులకు చూపిస్తామని బెదిరిస్తూ బాలికను నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు.

దానిని రికార్డు చేసి తన స్నేహితులకు ఒకరి తర్వాత ఒకరికి పంపించి రాక్షసానందం పొందాడు. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. బాలికను వేధించిన సజ్జన్వార్, వంశీ కృష్ణ, పవార్ తరుణ్, సాబ్లే బాలవంత్ సింగ్, కారడ్ సుధీర్, ముర్కుటే విఠల్‌తో పాటు మరో ఇద్దరు బాలురులపై ఫిర్యాదు చేశారు.

షీ టీం సహాయంతో సీఐ బండారి రాజు ఆధ్వర్యంలో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు బాలురు ఉన్నారు. వీరందరినీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.