23-06-2025 12:47:26 AM
- ఉద్యోగులను తొలగించే దిశగా ఐటీ కంపెనీలు
- లో పెర్ఫార్మెన్స్ ఆధారంగా తొలగించే అవకాశం
- నిర్వహణ ఖర్చు తగ్గించుకునే పనిలో కంపెనీలు
- ఆందోళనలో ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులు
- నైపుణ్యం పెంచుకోవాలని సూచిస్తున్న నిపుణులు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రి య 2025లోనూ కొనసాగుతూనే ఉంది. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలైన ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పానాసోనిక్, గూగుల్, అమెజాన్ వంటివి ఇప్పటికే 60 వేలకుపైగా ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ కార్యకాలాపాలను పునర్నిర్మించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిం చాయి.
వ్యాపార ప్రాధాన్యాలను మార్చుకోవడంలో భాగంగా వేలాది మంది ఉద్యోగు లను తొలగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంలో ఐటీ రంగం రూపురేఖలే మారిపోతున్నాయి. కంపెనీలన్నీ తమ నిర్వహణ సామర్థ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. సాంకేతిక పరివర్తనలో భాగంగా కంపెనీల నిర్వహణలో జీతాల భారం పెరిగిపోతుండటంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఏఐ వైపు మొగ్గుచూపుతున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆందోళనలో ఉద్యోగులు..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆయా ఐటీకంపెనీల్లో లేఆఫ్స్ కారణంగా భారీగా ఉద్యోగా లు కోల్పోతున్న నేపథ్యంలో టెకీలు ఆందోళన చెందుతున్నారు. కరోనా విలయం తర్వాత ఐటీ రంగం ఇంకా కోలుకోలేదు. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. గతంతో పోలిస్తే కంపెనీల్లో కొత్త ఓపెనింగ్స్కి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలని ఉద్యోగులు సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో లేఆఫ్స్ వారిని మ రింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే లేఆఫ్ ప్రకటించే కంపెనీలన్నీ ముఖ్యంగా నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, ఉద్యోగుల్లో నైపు ణ్యం లోపించడం వంటి కారణాలు చూపి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఉద్యోగులు నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
కంపెనీల వారీగా తొలగింపులు..
ఇంటెల్ కంపెనీ 2025లో అతిపెద్ద టెక్ లేఆఫ్కి శ్రీకారం చుట్టేందుకు పూనుకున్నది. ఈ ఏడాది ఏకంగా 21 వేలకుపైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ తొలగిం పు దాదాపు ఇంటెల్ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 20 శాతంగా ఉంది. డిసెంబర్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ఇంటెల్ సంస్థలో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇంటెల్ చేపట్టే ఈ లేఆ ఫ్ టెక్ చరిత్రలో అతిపెద్ద లేఆఫ్లో ఒకటిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన పానాసోనిక్ తమ సంస్థ సమగ్ర పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నది. ఇది ఆ కంపెనీలోని మొత్తం ఉద్యో గుల్లో 4 శాతం కావడం గమనార్హం. ముఖ్యం గా ఎక్కువ వృద్ధి లేని టెలివిజన్, పారిశ్రామిక పరికరాల తయారీని తగ్గించుకుని, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై దృష్టి సారించనున్నది.
మైక్రోసాఫ్ట్ దశలవారీగా 6 వేలకుపైగా..
మైక్రోసాఫ్ట్ కంపెనీ 2025లో దశల వారీగా లేఆఫ్ చేయాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. లేఆఫ్లో భాగంగా 6.5వేలకు పై గా ఉద్యోగులను తొలగించనున్నది. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 3 శాతంగా ఉంది. మొత్తం 2,28,000 మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ లేఆఫ్ ప్రభావం సాఫ్ట్వేర్ ఇంజి నీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, టెక్నికల్ ప్రొగ్రామ్ మేనేజర్లు, మార్కెటర్లు, లీగల్ కౌన్సిలర్లపై పడనున్నది.
లేఆఫ్లో ముఖ్యంగా మిడిల్ మేనేజర్లు, నాన్ కోడింగ్ సాఫ్ట్ను తొలగించి ప్రొగ్రామర్లను పెంచుకునే అంశంపై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయి న మెటా సంస్థ ఈ ఏడాది 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నది. పర్ఫార్మెన్స్ సరిగా లేని వారిని తొలగించే దిశగా చర్యలు తీసుకుంటోంది. మెటా సంస్థలో మొత్తంగా 72 వేల మంది ఉద్యోగులుండగా అందులో 3,600 మందిని ఈ సారి లేఆఫ్లో తొలగించనున్నది.
నిస్సాన్ కంపెనీ 20 వేలు..
జపాన్ వాహన తయారీ కంపెనీ అయిన నిస్సాన్ సంస్థ 2027కల్లా 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. తమ ఫ్యాక్టరీల సంఖ్యను 17నుంచి 10కి తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు వివరించింది. క్రౌడ్స్ట్రయిక్ సంస్థ త్వరలో 500 మంది ఉద్యోగులను తొలగించే దిశగా చూస్తోంది.
సంస్థలో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 5 శాతం ఉద్యోగులను లేఆఫ్ కారణంగా తొలగిస్తున్నది. తద్వారా 36 మిలియన్ డాలర్ల నుంచి 53 మిలియన్ డాలర్ల వరకు నిర్వహణ ఖర్చును తగ్గించుకోనున్నది. ఆలోమేటిక్ అనే సంస్థ తమ ఉద్యోగుల్లో 16 శాతం తొలగించేందుకు చూస్తున్నది. ఈ లేఆఫ్తో దాదాపు 1,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నది.
పలు కంపెనీల్లో తొలగింపులు..
సంస్థ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ‘ఫ్యూచర్ నౌ’ పేరుతో హెచ్పీ కంపెనీ 2 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నది. ఈ చర్యతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 300 మిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకునేందుకు పూనుకున్నది. గూగుల్ సంస్థ కూడా పలు దశల్లో లేఆఫ్ చేయనున్నది. 2025లో వందలాది మంది ఉద్యోగుల తొలగింపునకు గూగుల్ కంపెనీ సిద్ధపడింది. అమెజాన్ సంస్థ కూడా లేఆఫ్ వైపు దృష్టి సారిస్తున్నది.
అలెక్సా వాయిస్ అసిస్టెంట్, ఎకో స్మార్ట్ స్పీకర్స్, రింగ్ వీడియో డోర్బెల్స్, జూక్స్ రోబోటాక్సిస్ బిజినెస్లకు చెందిన ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసమే లేఆఫ్ చేస్తున్నట్టు అమెజాన్ సంస్థ తెలుపుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్ కంపెనీ దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది.
జెఫ్ బెజోస్ స్పేస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్ 10 శాతం ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 1,000మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నది. క్లౌడ్ ఆధారిత కస్టమర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన సేల్స్ఫోర్స్ కూడా లేఆఫ్ మార్గాన్నే అవలంబించనున్నది.
త్వరలో 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నది. మానవ వనరులను తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూసే పరికరాల తయారీపై సేల్స్ఫోర్స్ సంస్థ దృష్టి సారించనున్నది. వర్క్డే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిపై వ్యూహాత్మకంగా దృష్టి సారించడంలో భాగంగా 1,750 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పిస్తున్నది. ఇది ఆ సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 8.5 శాతం కావడం గమనార్హం.