calender_icon.png 14 June, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహోద్యమంలా వన మహోత్సవం!

12-06-2025 01:30:25 AM

- రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

- పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణతో పాటు వన మహోత్సవం 2025 పోస్టరు ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ప్రజా ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే వనమహోత్సవం కార్యక్రమాన్ని ఫారెస్టు డిపార్టు మెంటు అధికారులు మహోద్యమం లా ముందుకు తీసుకెళ్లాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.

వృక్షో రక్షిత రక్షితః నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. వన మహోత్సవం పోస్టరును బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. పోస్టరు ఆవిష్కరణలో తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షిణాధికారిణి సువర్ణ, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, సోషల్ ఫారెస్టు రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... ఈ ఏడాది వనమహోత్సవ కార్యక్రమం వంద శాతం విజయవంతం అయ్యేలా చూ డాలన్నారు.

అన్నివర్గాల వారు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నాటిన ప్రతీ మొక్కను బతికించ డానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పండ్ల మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాల్లో జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందు కు వెళ్ళాలని సూచించారు. 2024 సంవత్సరం డిపార్టుమెంటు వారీగా, డిస్టిక్ వారీగా రాష్ర్టవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా... 19.04 కోట్లు నాటినట్టు మంత్రి సురేఖ గుర్తు చేశారు. 

ప్రజా ప్రభుత్వంలోనే సమస్యలు పరిష్కారం

-మంత్రుల ముఖాముఖిలో మంత్రి కొండా సురేఖ

ప్రజా ప్రభుత్వంలోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. సామాన్య ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి సురేఖకి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు. దాదాపు 110 సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి.

వాటిని ఆమె అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆమె మీడియా మాట్లాడుతూ... తమపై, తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం వల్లే... ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని ఉద్ఘాటించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రాజీవ్ యువ వికాసం, రెవెన్యూ, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి సురేఖ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, హైదరాబాద్ అధికారులతో పాటు ఇతర పోలీసు అధికారులకు వెంటనే ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 110 దరఖాస్తులను మంత్రి ప్రజల నుంచి స్వీకరించగా, అందులో దాదాపు అన్ని సమస్యలు మంత్రి పరిష్కరించారు.  రాష్ర్ట ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అందరి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోతున్నారని, తాము గత పాలకుల్లా నిరంకుశంతో ఉండబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవరిస్తుందని, మహత్మా జ్యోతిబాపూలే భవన్ తో పాటు జిల్లాల్లో ప్రజా వాణి ద్వారా ప్రజల వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.