12-06-2025 01:29:57 AM
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభు త్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు.
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా వివరించారు. సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. తెలంగాణ రైజింగ్లో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమకున్న పెద్ద ఆస్తి యువత అని, వారిలో ప్రతిభకు కొదవ లేదన్నారు. పరిశ్రమలకు అవసరమైన రెడీమేడ్ మానవ వనరులను అందించే బాధ్యతను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
10 వేల మంది యువతకు శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలని మలేషియా దిగ్గజ సంస్థ స్ప్రింగ్ సెమీ కండక్టర్స్ సీఈవో కెన్ కూను కోరారు. తెలంగాణను స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కెన్ కూ ప్రశంసిచారు. తమ వంతుగా ఇక్కడి యువతను సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.
విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలు ఇక్కడ శిక్షణ, మిగిలిన కాలం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. టీ సహకారంతో 2030 నాటికి 10 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్బాబుకు వివరించారు.
పరిశ్రమలు రాకుండా బీఆర్ఎస్ కుతంత్రాలు
తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. యువతకు ఉపాధి దొరకకుండా చేయాలన్నదే వారి దుర్మార్గపు ఆలోచనగా కనిపిస్తోందని బుధవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఏడాదిన్నర కాలంలో రాష్ర్టంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రైవేట్ సెక్టారులో లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు.
పరోక్షంగా మరో లక్ష మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గులాబీ పార్టీ కలవరపడుతోందని ఎద్దేవా చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకాలు సృష్టిస్తూ, రైతులను రెచ్చగొడుతోందన్నారు. అరాచకం సృష్టించాలని చూస్తే ప్రభుత్వ యంత్రాంగాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్పల్పకాలంలోనే రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యం స్థానంగా మార్చించదని తెలిపారు. గతంలో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు రావడానికి వెనకాడేవని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో చదువులకు, ఇండస్ట్రీకి మధ్య ఉన్న నైపుణ్యాలకు సంబంధించిన అంతరాయాన్ని పూరిస్తున్నామని వెల్లడించారు.
ప్రతి నిరుద్యోగి ఏదో ఒక స్కిల్లో శిక్షణ పొందేలా ప్రభుత్వం జిల్లా స్థాయిలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ పరిశ్రమలను, అభివృద్ధి కార్యక్రమాలను వ్యతిరేకించలేదని, రాష్ట్రాభివృద్ధి జరగాలని కోరుకున్నామని తెలిపారు.
అప్పటి ఒప్పందాలకు అభ్యంతరాలు చెప్పకుండా పెద్ద మనసుతో కొనసాగిస్తున్నామని, రోజు రోజుకు ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్, ప్రజల దృష్టిని మళ్లించేందుకు రైతులను రెచ్చగొడుతొందని విమర్శించారు. 2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమల అనుమతులకు సంబంధించి విధివిధానాలు జారీ చేసిందని ఆరోపించారు.