12-06-2025 01:31:55 AM
సూర్యాపేట, జూన్ 11 (విజయక్రాంతి) : అంగన్ వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య అందించడంతో చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ధి పెరుగుతుందని డిడబ్ల్యూఓ కె.నర్సింహా రావు అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో అమ్మమాట -అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాలకు ముందు పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు యూనిఫామ్స్, ఫ్రీస్కూల్ బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుబ్బలక్ష్మి, సూపర్వైజర్ వీరమ్మ, ఏఎన్ఎమ్ పద్మజ, అంగన్వాడీ టీచర్లు రమణ, సుజాత, సలోమి, ఆశా కార్యకర్తలు అర్చన, వెంకటమ్మ, సునీత, స్వర్ణలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.