10-07-2025 10:09:46 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వం జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ భానోత్ జగదీశ్వర్(RMO Dr. Bhanot Jagadishwar) ఇటీవల ఉత్తమ సేవలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నేపథ్యంలో గురువారం వైద్య బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి సి హెచ్ డాక్టర్ వెంకట్ రాములు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, డాక్టర్ వీరన్న, డాక్టర్ రమేష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.