14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

పాత్రికేయుల సేవలను గుర్తించి ఆత్మీయ సన్మానం..

19-10-2025 08:53 PM

తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్..

చిట్యాల (విజయక్రాంతి): సమాజ సమస్యలను వెలుగులోకి తేవడంలో, ప్రజల గళాన్ని పాలకులకు వినిపించడంలో, నిజాన్ని నిష్పక్షపాతంగా అందించడంలో పాత్రికేయులు పోషిస్తున్న సేవలను గౌరవిస్తూ పత్రికా విలేకరులకు “ఆత్మీయ సన్మాన కార్యక్రమం”ను నిర్వహించి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కునూరు సంజయ్ దాస్ గౌడ్ - సాత్విక దంపతులు కూతురు క్లింకారతో కలిసి పాత్రికేయులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం ద్వారా సమాజానికై కలం పట్టిన జర్నలిస్టుల కృషిని గుర్తించి, వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజల కోసం కలం పట్టి నిజాన్ని వెలిబుచ్చే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాటి మోహన్ రెడ్డి, మూడ వేణు  మెండే వెంకన్న యాదవ్, రేగొండ వేణుమాధవ్,  మూడ వెంకటాద్రి,  చెన్నోజు చంద్ర శేఖర్, గుడ్లపల్లి వెంకన్న, పోకల కరుణాకర్, చికిలం మెట్ల మెహర్ బాబు, చెరుపల్లి శ్రీనివాస్, కూనూరు మధుగౌడ్ పాల రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు