13-12-2024 04:18:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): బంజారా సమాజానికి చెందిన యువ న్యాయవాది శైలజ న్యాయవాద వృత్తిలో సభ్యత్వం తీసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ సంఘం నాయకులు ఆమెను సన్మానం చేశారు. నిర్మల్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో శాలువాతో సన్మానం చేసి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తుకారం నాయక్ అశోక్ నాయక్ రాజేందర్ నాయక్ తదితరులున్నారు.