16-12-2024 01:27:06 AM
కోనరావుపేట, డిసెంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులోని బిజిగం అనిల్ (31) అనే యువకుడు పొలంలో పడి మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్రెడ్డి తెలిపారు. గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద అనిల్ బైక్తో సహా పొలంలో పడి మృతి చెందినట్లు తెలిపారు. అనిల్ మృతి అనుమానం ఉన్నదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.