calender_icon.png 27 June, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. బయటపడ్డ 'బొగ్గు బట్టి' భాగోతం..!

27-06-2025 08:19:09 AM

మొదటి సారి తప్పించుకొని రెండవ సారికి ఏసీబీ వలలో చిక్కుకున్న కార్యదర్శి

పెన్ పహాడ్ : బొగ్గు బట్టి పర్మిషన్ డీల్ చేసుకొని బోగస్ గా మారిన ఆఉద్యోగి ఏసీబీ(Anti-Corruption Bureau) వలలో చిక్కుకొన్నాడు. 'బొగ్గు బట్టి' పర్మిషన్ ఇస్తే పోయేది ఏముంది.. నాచేతికి 'నోట్ల బట్టి వస్తుందన్న ఆశ పడ్డ అవినీతి తిమింగలంకు ఆడియాశలు కాగా చివరికి కటకటాలోకి నెట్టేసింది. ఈ అవినీతి బొగ్గు బట్టి భాగోతం సూర్యాపేట జిల్లా(Suryapet district) పెన్ పహాడ్ మండలంలోని నాగులపాటి అన్నారంలో గురువారం జరిగింది. నల్లగొండ రేంజర్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపిన ప్రకారం..గ్రామములో విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కారద్యర్శి అనంతుల సతీశ్ కుమార్ ఈనెల 6న, ఓ బొగ్గు బట్టీ యజమానితో బట్టీ పెట్టు కోవడానికి అనుమతి (ఎన్ఏసీ) ఇవ్వడానికి రూ.15వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంత మొత్తంలో డబ్బులు ఇవ్వలేనని కార్యదర్శిని సదరు యజమాని బతిమలాడాడు. అయినా పలుసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. చివరికి రూ. 8 వేలు డీల్ కుదరగా.. అయినా కార్యదర్శికి ఇవ్వడం ఇష్టలేక బొగ్గు బట్టి యజమాని పలు ఆధారాలతో ఏసీబీ ' అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు ఏసీబీ అధికారి జగదీశ్ చందర్ తన సిబ్బందితో చేరుకొని పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పలు ఆధారాలు నిజమని సదరు కార్యదర్శి ఒప్పుకోవడంతో కార్యదర్శి సతీశ్ కు మార్ పై కేసు నమోదు చేసి హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతున్నట్లు జగదీశ్ చందర్ తెలిపారు. అయితే వారం రోజుల క్రితం డీల్ కుదుర్చుకోగానే ఎక్కడకి రావాలని బొగ్గుబట్టీ యజమాని పదే పదే పోన్లు చేయడంతో గమనించిన కారద్యర్శి తప్పించుకొన్నాడు. ఇక రెండవసారి గురువారం తప్పించుకోలేక ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కుకున్నటు తెలిసింది.