12-06-2025 01:33:27 AM
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కార్మికుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా సింగరేణి సంస్థ కుదుర్చుకున్న రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం చారిత్రక ఘట్టమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.బుధవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడారు.
సాధారణ మరణం సంభవించిన వారికి రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. పీఎన్బీ ద్వారా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం రూ. 40 లక్షల ప్రమాద బీమా ఒప్పందాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు అధికారులు ఎస్డీఎం సుభాని, ఎన్.వీ.రాజశేఖర్రావు, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.