12 June, 2026 | 12:23 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి

15-11-2025 12:00 AM

పోలీసు కమిషనర్ ఎం.విజయ్ కుమార్

సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:14జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో బాలల దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మానికి పోలీసు కమిషనర్ ఎం.విజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. పిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన పెంచాలని, ఎక్కడైనా అసభ్య ప్రవర్తన కనపడితే వెంటనే డయల్ 100 చేయాలని సూచించారు.

ఆరోగ్యానికి సరైన ఆహారం, వ్యాయామం అవసరమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోవాలని, జీవితంలో లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరొచ్చన్నారు. కృప భవనం, బాలసదనం, ఆశా జ్యోతి, శిశుగృహం, చిన్నారులు నృత్యాలు, శ్లోకాలతో ఆకట్టుకున్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, పిల్లలు పుష్టికర ఆహారం తీసుకొని చదువులో ముం దుండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ శారదా, డిఆర్‌ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిఎంహెచ్‌ఓ ధనరాజ్, డిపిఓ వినోద్ కుమార్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి సాయి పాల్గొన్నారు.