02-05-2025 12:06:27 AM
యాదాద్రి భువనగిరి మే 1 (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ డీ మురళీ కాలు పైనుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం నాడు గంజ్ ప్రాంతంలో ఎమ్మెల్యే మీటింగ్ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఓ కార్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల కానిస్టేబుల్ కాలు మీది నుండి వెళ్లడంతో గాయపడ్డాడు. సహచర పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ విషయం తెలిసిన భువనగిరి డివిజన్ ఎసిపి కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్, భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ , కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం ఎదురైనా, శాఖ వారి పట్ల పూర్తి అండగా ఉంటుందని ఏసీపీ తెలిపారు.