15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు 700 ఎకరాలు

04-11-2025 01:26 AM

-భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ కోసం ఆదిలాబాద్‌లో 700 ఎకరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రానున్న రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరంగల్‌లోని మామానూరు విమానాశ్రయ అభివృద్ధికి కావాల్సిన భూసేకరణ పూర్తి కావొచ్చింది.

ఇక్కడ అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆదిలాబాద్‌లోనూ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భారత వాయుసేన అంగీకారం తెలపడంతో ఏఏఐ రాబోయే రెండేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది.