15 April, 2026 | 1:53 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

లా అండ్ ఆర్డర్ అతిక్రమిస్తే చర్యలు

29-01-2026 12:48 AM

పెబ్బేరు ఎస్‌ఐ యుగంధర్ రెడ్డి

పెబ్బేరు, జనవరి 28 : మున్సిపల్ ఎన్నికల వేళ ఎవరైనా సరే లా అండ్ ఆర్డన్ను అతిక్రమిస్తే చర్యలు కఠిణంగా ఉంటాయని పెబ్బేరు ఎస్త్స్ర యుగంధర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నందున ఎవరైనా వ్యక్తులు రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్తే తప్పనిసరిగా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. లేనిచో అట్టి డబ్బులను సీజ్ చేయడానికి వెనుకాడబోమని చెప్పారు.

అంతేకాక పార్టీల మీద కానీ, పార్టీలకు చెందిన వ్యక్తుల పైన గాని, మరే ఇతర వక్తుల పైన గాని విమర్శలు చేస్తున్నట్టు వాట్సాప్ గ్రూప్ లలో ఏదైనా మెస్సెజ్ లు పోస్ట్ చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అంతేకాక అట్టి వాట్సప్ గ్రూపులకు సంబంధించిన అడ్మిన్ ఎవరైతే ఉంటారో వారిపై కూడా కేసు నమోదు చేయడానికి సంశయించబోమని హెచ్చరించారు.