17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

29-01-2026 10:45 AM

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య 

 మృతుడి మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య

 మృతుడు పలుమార్లు హెచ్చరించడంతో హతమార్చిన ఘటన

 పరారీలో భార్య మృతుడి మేనల్లుడు

మాడుగులపల్లి, (విజయక్రాంతి): ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపిన ఘటన మాడుగుల పల్లి మండలంలో చోటు చేసుకుంది.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని,సీత్యా తండాకు చెందిన (మృతుడు )రమావత్  రవి నాయక్ (34) ను,భార్య రమావత్  లక్ష్మి,మంగళవారం రాత్రి,ఇతర వ్యక్తులతో కలసి హతమార్చినట్లు తెలిపారు. మృతుడి మేనల్లుడుతో గత నాలుగేళ్ల నుండి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రవి పలుమార్లు హెచ్చరించడంతో కోపం పెంచుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవిని భార్య, భార్య ప్రియుడు కలిసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి రవి భార్య, మేనల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతుడు తండ్రి లక్ష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి కీ తరలించినట్లు తెలిపారు.