24-07-2025 11:02:40 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్(Additional Collector Chander Naik) గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సమీకృత భవనంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై అన్ని గ్రామాల ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.