18-06-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూన్ 17: స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థిని ప్రతిష్ఠాత్మక గిన్నీస్ బుక్ ఆఫ్ రికారడ్స్ లో చోటు సంపాదించుకోవడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైనారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కళల పరిరక్షణ ముఖ్యంగా ప్రాచీన కాలంనాటి వైభవాన్ని మరియు కట్టడాలను గురించి తెలుసుకోవాలని తద్వారా చరిత్రను తెలుసుకున్నవారావుతారని, కళలలో పాల్గొనడం ద్వారా ఆనందం కల్గుతుందని మరియు ఒత్తిడి నుండి విముక్తి కలగడంతో పాటు పని పట్ల శ్రద్ద వహించడంతో విజయం వరిస్తుందని చెప్పారు.
ఇటీవల కాలంలో రాష్ట్ర రాజధానిలోని ఎల్.బి.స్టేడియంలో నిర్వహించినటువంటి గిన్నీస్బుక్ ఆఫ్ రికారడ్స్ పాఠశాలకు చెందినటువంటి బుక్క దీత్య, 5వ తరగతి విడుఆర్టిని జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో సుమారు 2400 మందికి పైగా కళాకారులతో కలిసి పాల్గొని ప్రతిష్ఠాత్మక గిన్నీస్బుక్ ఆఫ్ రికారడ్స్ చోటు కైవసం చేసుకోవడం చాలా చారిత్రాత్మక విజయమని మరియు చిన్నారి ఇతరులకు ఆదర్శమని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదనిచెప్పారు.