18-06-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
పటాన్చెరు, జూన్ 17 : ప్రతి స్కూల్, కళాశాల యాజమాన్యాలు తమ బస్సు డ్రైవర్లను విధులలోనికి అనుమతించే ముందు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసిన తరువాతనే విధులలోనికి అనుమతించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు.
మంగళవారం పటాన్చెరువు పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా పోలీసుల తనిఖీలో పట్టుబడినట్లైతే డ్రైవర్ తో పాటు విధ్యాసంస్థల యాజమాన్యాలపై చట్టరీత్య కఠిన చర్యలు తప్పవన్నారు.