18-06-2025 12:00:00 AM
ఎంపీ రఘునందన్ రావు
పటాన్ చెరు, జూన్ 17 :ప్రజలు, దేశ సంక్షేమమే బీజేపీ లక్ష్యమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆ దిశగానే ప్రధాని నరేంద్రమోడీ పని చేస్తున్నారని అన్నారు. మంగళవారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిన్నారం మండలం మాదారం లోని కొలను అనంత రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రైతులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమానికి ఎంపీ రఘునందర్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ పదకొండు సంవత్సరాల సుపరిపాలనపై ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. రైతుల సంక్షేమం ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానీ మోడీ బలోపేతం చేశారని అన్నారు. దేశ రక్షణ, ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా ప్రధాని పని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అదెల్లీ రవీందర్, నర్సింగ్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నరసింహారెడ్డి, పోచారం రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, వివిద మండలాల అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.