04-12-2025 12:00:00 AM
కొత్తపల్లి, డిసెంబరు 3 (విజయ క్రాంతి): కొత్తపల్లి ఆల్ఫోర్స్ సి టెక్నో పాఠశాల 6వ తరగతి విద్యార్థులు బుధవారం న్యాయవాద దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్పూర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర చాలా ప్రశంసనీయమైనదని అన్నారు.
సమాజ శ్రేయస్సు కోరే వారిలో వారు ముందంజలో ఉంటారని తెలిపారు..ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.