15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

10-12-2025 08:27 PM

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి..

జగిత్యాల డీఎస్పీ రఘు చందర్..

ధర్మపురి (విజయక్రాంతి): ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు కోరుట్ల నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తుండగా జగిత్యాల నియోజకవర్గంలో రెండవ విడత, ధర్మపురిలో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయన్నారు.

ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల భధ్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని, గ్రామాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్ట్లు, ఏర్పాటు చేశామని, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎటువంటి అల్లర్లకు గొడవలకు పాల్పడకుండా తమ గ్రామ సర్పంచులను గెలిపించుకోవాలని పోలీస్ శాఖ తరుపున విజ్ఞప్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించుకోవాలని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దని పోలీస్ శాఖ తరుపున ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ లు పాల్గొన్నారు.