17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

అపూర్వ విద్యార్థుల సమ్మేళనం

11-05-2025 10:33 PM

నడిగూడెం: ఆనందం వెల్లివిరిసింది.. ఎప్పుడో కలిసిన మనం ఇప్పుడు ఇలా కలవడం ఆనందం అనుకునేలా ఎగసిపడేలాంటి సంతోషం ఇది అపూర్వ సమ్మేళనం. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 లో 10వ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆ రోజుల్లో విద్య బోధన చేసిన ఉపాధ్యాయులకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ఒకరిని ఒకరు అక్కున చేర్చుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీటి పర్వతమయ్యారు. అనంతరం వారు చదివిన పాఠశాలకు 20 వేల రూపాయల డొనేషన్ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో మేకల గంగరాజు మామిడి రామకృష్ణ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.