calender_icon.png 9 June, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

08-06-2025 10:06:07 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అలనాటి విద్యార్థులు అభివృద్ధి చెంది వివిధ రంగాలలో స్థిరపడటం చూసి తానేంతో సంతోషిస్తున్నానని ఉత్తమ ఉపాధ్యాయులు హనుమా రెడ్డి(Hanuma Reddy) అన్నారు. ఆదివారం నెల్లిపాక బంజర్ పాఠశాలలో ఆదివారం 1986-87 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమారెడ్డి మాట్లాడుతూ... 39 సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు ఈ సమ్మేళనం ద్వారా తమ స్నేహాన్ని మరింత దృఢపరుచుకున్నారన్నారు.

అనంతరం విద్యార్థులు తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటలు ఆడి, పాటలు పాడి రోజంతా ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రేణుక, ఝాన్సీ, జ్యోతి, శారదా, రమకుమారి, సైదమ్మ, మధు, రాజేందర్, శ్రీనివాసరెడ్డి, భాస్కర రెడ్డి, మురళి, రాం ప్రసాద్, వెంకట రెడ్డి, బ్రహ్మం, నాగేంద్రం తదితర విద్యార్థులు పాల్గొన్నారు.