08-06-2025 09:15:00 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారినీ పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం హోటల్లో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. దేవాలయం వద్ద అధికారులు సాయిబాబా అర్చకులు పాల్గొనగా, ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు నవాబ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.