14-06-2025 12:02:14 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 13 (విజయ క్రాంతి) : ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ట్రేసా నూతన కార్యవర్గం సభ్యులకు మహబూబ్ నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 2025-2028 కాలానికి మహబూబ్ నగర్ జిల్లా శాఖ ట్రేసా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహబూబ్ నగర్ జిల్లా శాఖ ట్రేసా నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులతో పాటు ట కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రేసా కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ ఎఓ శంకర్, శ్యాంసుందర్ రెడ్డి, బి.శ్రీనివాసులు, బి.బాలప్రసాద్, సునీల్ కుమార్, గాయత్రి, సువర్ణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.