calender_icon.png 14 June, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నపు దొంగల ముఠా గుట్టు రట్టు

14-06-2025 12:01:29 AM

ఐదుగురిపై కేసు, ఇద్దరి అరెస్ట్

కరీంనగర్ క్రైం, జూన్ 13 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో ఈనెల 8న తాళం వేసి ఉన్నావ్ ఇంటిలో దొంగతనం చేసి 33 జూలాల బంగారూ ఆభరణాలు, వెండి, నగర్ దొంగిలించిన కన్నపు దొంగల గుర్తు రట్టయింది.

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 8న గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపు గడియలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారని, దొంగలు మొత్తం రెండు అల్మారాల పగలగొట్టి వాటి నుండి రూ. 3,75,000/- విలువైన 33 తులాల బంగారు ఆభరణాలు, రూ. 12,500/- విలువైన వెండి, మరియు రూ. 25,000/- నగదుతో ఉడాయించారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను గుర్తించారు . ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో ముగ్గురు ప్రత్యక్షంగా దొంగతనానికి పాల్పడగా ఇద్దరు దొంగిలించిన సొత్తులో కొంత బంగారాన్ని తక్కువ ధరకు కొన్నట్లుగా గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులు గాజుల హేమంత్, కొమ్ము నవీన్ లను పట్టుకోగా ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుండి దొంగిలించబడిన 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు,ఒక ప్యాషన్ ప్లస్ మో ట్సాకిల్, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

నేరస్థులను గుర్తించి పట్టుకుని వారినుండి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేయటం లో కృషి చేసిన రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ , చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ , క్లూస్ టీం ఇన్స్పెక్టర్ రాజు, గంగాధర ఎస్త్స్ర వంశీకృష్ణ, సీసీఎస్ ఎస్త్స్ర నాగరాజు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేంద్రపాల్ , కానిస్టేబుళ్లు రవీందర్, అవినాష్ , సాయి, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ ప్రదీప్ లను పోలీసు కమీషనర్ ప్రత్యేకంగాఅభినందించారు.