29-04-2025 08:47:33 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవమును మంగళవారం అంబేద్కర్ సంఘ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వి. సురేష్ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి తన ధ్యేయంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో తన వంతు పాత్రను పోషించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు, బడుగు బలహీన వర్గాల చెందిన సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు.