12-06-2025 05:03:39 PM
అహ్మదాబాద్: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేని బాధను కలిగించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పేర్కొన్నారు. విపత్తు ప్రతిస్పందన దళాలను వెంటనే ప్రమాద స్థలానికి తరలించారు. పరిస్థితిని అంచనా వేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్(Gujarat CM Bhupendra Patel), హోం మంత్రి హర్ష్ సంఘవి(Gujarat Home Minister Harsh Sanghvi), పోలీసు కమిషనర్ అహ్మదాబాద్తో మాట్లాడినట్లు ఆయన ట్వీట్ చేశారు. అనంతరం ప్రమాద నేపథ్యంలో అహ్మదాబాద్ కు అమిత్ షా బయల్దేరారు.
గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్లో గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ కు వెళ్తున్న AI171 విమానం గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కూలిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం. మేఘానీనగర్ లోని బీజే మెడికల్ కాలేజి హస్టల్ భవనంపై కుప్పకూలడంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువులు మెడికో విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది.
గాయపడిన వైద్యు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు అటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ భారతీయులు, ఏడుగురు పోర్చుగీసు వారు, ఒక కెనడీయన్ తో సహా మొత్తం 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమాన ప్రయాణికుల సమాచారం కోసం హాట్ లైన్ నంబర్ 1800 5691 444 ఏర్పాటు చేశారు.