calender_icon.png 13 June, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

12-06-2025 04:38:15 PM

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్‌లో గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ కు వెళ్తున్న AI171 విమానం గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కూలిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం.

సంఘటన జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, ప్రయాణీకులతో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  ప్రయాణికుల్లో అత్యధికులు చనిపోయారని అధికారులు భావిస్తున్నారు. మేఘానీనగర్ లోని బీజే మెడికల్ కాలేజి హస్టల్ భవనంపై కుప్పకూలడంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువులు మెడికో విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది.

గాయపడిన వైద్యు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు అటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ భారతీయులు,  ఏడుగురు పోర్చుగీసు వారు, ఒక కెనడీయన్ తో సహా మొత్తం 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమాన ప్రయాణికుల సమాచారం కోసం హాట్ లైన్ నంబర్ 1800 5691 444 ఏర్పాటు చేశారు.