13-08-2025 08:26:09 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) పట్టణానికి చెందిన పిట్ల సోహిత(17) ఇంటర్లో 991 మార్కులు జేఈఈలో ర్యాంకు సాధించింది. అయితే జూన్ 20వ తేదీన స్పృహ తప్పి కింద పడిపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. పరిస్థితి విషమించి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను నలుగురికి దానం చేశారు. విద్యార్థిని తండ్రి విజయ్ కామారెడ్డి మున్సిపాలిటీలో పని చేస్తున్నారు.